- Advertisement -
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో భద్రత దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం సోఫియా జిల్లాలోని రెబన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నారన్న సమచారం అందుకున్న భద్రత దళాలు కార్డెన్ సెర్చ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు, జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
2 Terrorists Killed by Security Forces in Encounter in J&K
- Advertisement -