Saturday, April 27, 2024

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

- Advertisement -
- Advertisement -

2 terrorists killed in encounter in Jammu and Kashmir

కాశ్మీర్: జమ్ముకాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని అంషిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీసులు ఇద్దరు ముష్కరులను హతమార్చారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో సహా నేరారోపణ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్ జోన్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News