- Advertisement -
షిల్లాంగ్: మేఘాలయాలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాకు చెందిన మావ్నీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు మహిళా క్రికెటర్లు మరణించగా మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడిన రజియా అహ్మద్, స్థానిక క్రీడాకారిణి ఫిరోజియా ఖాన్ మృతదేహాలను కూలిపోయిన ఇంటి శిథిలాల నుంచి వెలికితీసినట్లు జిల్లా ఎస్పీ సిల్విస్టర్ నాంగ్టింగర్ తెలిపారు. గల్లంతైన మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 2011-12 నుంచి వివిధ జాతీయ స్థాయి టోర్నమెంట్లలో రాష్ట్రం తరఫున రజియా ప్రాతినిధ్యం వహించినట్లు మేఘాలయ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గిడియన్ ఖర్కోంగర్ తెలిపారు.
2 women cricketers killed after landslide in Meghalaya
- Advertisement -