- Advertisement -
పెషావర్: పాకిస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 20మంది చనిపోయారని ఆ దేశ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి ఖైబర్పక్తూన్ఖ్వా రాష్ట్రంలో ఈ దుర్ఘటన జరిగింది. ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం కాలువలోకి పడిపోయింది. కాలువ నుంచి 20 మృత దేహాలను వెలికి తీసినట్టు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు ఈ ప్రమాదం నుంచి సజీవంగా బయటపడ్డారు.
20 people killed in accident At Pakistan
- Advertisement -