Thursday, May 16, 2024

ఎపిలో 222 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

215 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24గంటల్లో 31,473 శాంపిళ్లను పరీక్షించగా 222 మందికి కరోనా పాజిటివ్ రాగా, కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,738కి చేరగా మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,423కి చేరింది. గడిచిన 24 గంటల్లో 275 మంది కరోనాతో కోలుకున్నారు. ఇంకా ఏపీలో 2,560 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 20,53,738 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులు పరిశీలిస్తే శ్రీకాకుళం 6, విజయనగరం 2, విశాఖ 35, తూర్పుగోదావరి 17, పశ్చిమ గోదావరి 22, కృష్ణా 31, గుంటూరు 38, ప్రకాశం 5, నెల్లూరు 24, చిత్తూరు 28, అనంతపురం 3, కర్నూలు 1, కడప 10మందికి కరోనా సోకింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News