Monday, April 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 239 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

239 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 239 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,64,650కు పెరిగింది. తాజాగా 336 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,55,961 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,911కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.69 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,778 యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం 50,569 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News