Wednesday, May 1, 2024

ఒక్కరితో 27మందికి…

- Advertisement -
- Advertisement -

24.1 percent of people are infected with Corona in India

 

దేశవ్యాప్తంగా 24.1% మందికి కరోనా
2020 డిసెంబర్ – 2021 డిసెంబర్ నడుమ ఐసిఎంఆర్ సర్వే ఫలితాలు
21 రాష్ట్రాల్లోని 70జిల్లాల 700గ్రామాల నమూనాలపై అధ్యయనం
నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్, 31%మందికి మహమ్మారి
రెండో దశ సీరో అధ్యయనం వెలువడితే మరిన్ని విస్మయకర అంశాలు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ఐసిఎంఆర్ నిర్వహించిన సర్వేలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఐసిఎంఆర్ 2020 డిసెంబర్ నుంచి 2021 జనవరి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను విడుదల చేసింది. దేశం మొత్తం మీద 24.1 శాతం మందికి క రోనా సోకినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 21 రా ష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లో 700 గ్రా మా లు/వార్డులలో 28,589 మంది సాధారణ జనా భా, 7,171 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో భాగంగా సేకరించిన నమూనాలను పరీక్షించిన తర్వాత పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులే అని పేర్కొంది.

ఒక్క కరోనా కేసు గుర్తిస్తే వారి ద్వారా అప్పటికే 27 మందికి వైరస్ సోకినట్లే అని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువమంది కరోనా బాధితులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి శాతం 26.2 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలలో 19.1 శాతంగా ఉంది. వైద్యులు, నర్సులు, క్షేత్రస్థాయి సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది మధ్య ఎక్కువ గణాంక వ్యత్యాసం లేనప్పటికీ, వైద్యులు నర్సులలో సంక్రమణ శాతం 26.6 శాతం ఉంటే, పరిపాలనా సిబ్బందిలో 24. 9 శాతంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన సర్వేలోనే వ్యాప్తి రేటు ఇంత ఉంటే మార్చి, ఏప్రిల్ లో మరింత అధికంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్!
2020 డిసెంబర్ నాటికి నగరాల జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా సోకి ఉంటుందని వివిధ నగరాల్లో నిర్వహించిన సీరో సర్వేల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఎపిలోని విశాఖపట్నం సహా దేశంలోని 12 నగరాల్లో నిర్వహించిన సీరో సర్వే గణంకాల విశ్లేషణ అధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కెనడాలోని టొరంటో యూనివర్శిటీకి చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రిసెర్చ్‌కి చెందిన శాస్త్రజ్ఞులు, థైరెకేర్ లాబ్స్‌కు చెందిన ఎ వేలమణి కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం వివిధ నగరాల్లో నిర్వహించిన సీరో సర్వేలో అక్కడి జనాభాల్లో 31 శాతం మందికి కరోనా పాజిటివ్ ఉందని వారు తెలిపారు. అంటే జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి గత ఏడాది డిసెంబర్ నాటికే కరోనా సోకిందన్న మాట. కరోనా తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ శాతం మరింతగా పెరిగి ఉండవచ్చు.

దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో స్వయంగా తమకు కరోనా సోకి ఉండవచ్చని భావించి పరీక్షలు చేయించుకున్న వారిలో సీరో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా ఉండడాన్ని మేము గమనించాం. యుక్త వయస్కుల్లో దాదాపు సగం మందిలో ఇది కనిపించింది. మరణాల గణాంకాలు, ఎంపిక చేసిన జనాభాలో ఇంతకు ముందు నిర్వహించిన సీరో సర్వేలతో ఈ ఫలితాలు సరిపోలుతున్నాయి’ అని పరిశోధకులు పేర్కొన్నారు. దేశం మొత్తం మీద 2,200కు పైగా శాంపిల్స్ కలెక్షన్ సెంటర్ల వద్ద స్వయంగా పరీక్షల కోసం వచ్చిన వారిలో 31 శాతం మందిలో సీరో పాజిటివిటీ కనిపించింది. అన్ని వయసుల వారిలోను పురుషుల (30%) కంటే మహిళల్లో (35 శాతం) ఎక్కువ సీరో పాజిటివిటీ ఉండడాన్ని వీరు గుర్తించారు. శాంపిల్స్ సేకరించిన వారంతా కూడా సామాజికఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న స్వయంగా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజీవ్ జయదేవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా వేర్వేరు నగరాల్లో మహమ్మారి వేర్వేరు సమయాల్లో తార స్థాయిలో ఉందని , ఉదాహరణకు ఢిల్లీలో ఇది జూన్‌డిసెంబర్ మధ్య గరిష్ఠ సస్థాయిలో ఉంటే చెన్నైలో జూలైలో, పుణెలో సెప్టెంబర్‌లో పీక్ స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. మొత్తంమీద సెప్టెంబర్ మధ్యలో పుణెలో అత్యధికంగా 69 శాతం సీరో పాజిటివిటీ ఉందన్నారు. దేశం మొత్తం కరోనా కేసుల్లో మూడో వంతు ఈ 12 నగరాల్లో ఉండడం గమనార్హం. భారీ స్థాయిలో ఉన్న సెకండ్ వేవ్‌ను కలిపితే కరోనా వైరస్ తాకిడికి గురయిన వారి శాతంఇంకా ఎక్కు వే ఉంటుందని జయదేవన్ చెప్పారు. దేశంలో 77 శాతానికి పైగా కుటుంబాలు కేవలం రెండు గదులు, అంతకన్నా తక్కువలో నివసిస్తున్నారని, ఫలితంగా భౌతిక దూరానికి అవకాశం లేదని, అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువ మందికి సోకుతున్న దృష్టా 90 శాతంకన్నా ఎక్కువ మందికి సోకే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News