Monday, April 29, 2024

అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి…..

- Advertisement -
- Advertisement -

పెద్ద మనసు చాటుకున్న సిఎం కెసిఆర్

25 Lakhs CM Relief Fund give to Young girl
మన తెలంగాణ/హైదరాబాద్:  సిఎం కెసిఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా నే అరుదైన వ్యాధితో ఓ విద్యార్థిని బాధపడుతోంది. ఈ విషయం సిఎం కెసిఆర్ దృష్టికి వెళ్లగా.. యువతి పరిస్థితిని తెలుసుకుని చలించిన సిఎం ఆ యువతి చికిత్సకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. యువతికి మంచి వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. వనపర్తి నియోజకవర్గం రేపల్లికి చెందిన శివాని పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (పిఎన్‌హెచ్) అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ముదిరితే యువతి ప్రాణాలకే ప్రమాదం. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో యువతి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది.

అయితే.. ఆ చికిత్సకు దాదాపు రూ.30 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. శివానీ కుటుంబం 20 ఏళ్ల క్రితమే బ్రతుకు దెరువు కోసం వలస వెళ్లి హైదరాబాద్ పీర్జాదిగూడలో స్థిరపడింది. క్యాబ్ డ్రైవర్ అయిన తండ్రి బాల్‌రెడ్డి పరిస్థితిని వనపర్తి ఎంఎల్‌ఎ, రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. శివాని పరిస్థితిని విని సిఎం చలించిపోయారు. శివాని చికిత్సకు రూ.25 లక్షల ఎల్‌ఒసి మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి చెక్‌ను మంగళవారం వనపర్తిలోని తన నివాసంలో మంత్రి నిరంజన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.దీంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స చేయనున్నారు. తమ కూతురు వైద్యానికి సాయం చేసిన సిఎం కెసిఆర్‌కు, మంత్రి నిరంజన్‌రెడ్డికి శివాని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News