Friday, May 3, 2024

రాష్ట్రంలో కొత్తగా 2,579 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2579 new corona cases Recorded in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 52,933 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 2,579 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1,08,670కి చేరాయి. ఈ వైరస్ తో ఇప్పటివరకు 770మంది ప్రాణాలు కోల్పోగా, 24గంటల్లో 1,752 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు 84,163 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,737 యాక్టివ్  కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో  295, రంగారెడ్డిలో 186, ఖమ్మంలో 161, వరంగల్ నగరంలో 143, నిజామాబాద్ లో 142, నల్గొండలో 129, మల్కాజ్ గిరిలో 106 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. అటు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.

2579 new corona cases Recorded in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News