Tuesday, April 30, 2024

దేశంలో కొత్తగా 26,041 పాజిటివ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

 26041 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: భార‌త్‌లో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,65,006 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త‌గా 26,041 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య‌శాఖ తాజాగా వెల్ల‌డించింది.ఇక, కరోనా వైర‌స్ కారణంగా మరో 276మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3.36కోట్లకు పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా క‌రోనా బారిన పడి 4,.47 లక్షలమంది బాధితులు మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో 29వేల మంది వైర‌స్ నుంచి కోలుకోగా… ఇప్పటివరకు దేశంలో 3.29కోట్ల మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.99 లక్షల కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 86 కోట్లకు పైగా కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

 26041 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News