Wednesday, May 1, 2024

దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు..

- Advertisement -
- Advertisement -

1115 corona positive cases registered in AP

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.గత 24 గంటల వ్యవధిలో 12,08,247మందిని పరీక్షించగా దేశంలో కొత్తగా 27,254మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారిన పడి మరో 219మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఒక కేరళలోనే కొత్తగా 20,240 పాజిటీవ్ కేసులు బయట పడగా, 67మంది బాధితులు మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,32,64,175కు చేరింది. ఇక, కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4,42,874 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 37,687మంది బాధితులు కోలుకోగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,47,032కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,74,269 లక్షల కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74,38,37,643 కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

 

27254 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News