Thursday, May 16, 2024

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

car accident

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు తమిళనాడు నుంచి తెలంగాణకు వస్తుండగా జిల్లాలోని పాకాల మండలం గుండ్లగుట్టపల్లి దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారంతా తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

3 dies in Car Accident in Chittoor District

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News