- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24గంటల్లో 31,118 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 482 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ లో ప్రకటించింది. అదే సమయంలో కరోనా మహమ్మారి నుంచి మరో 41,985 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. ఇండియాలో 1,37,621 మంది బాధితులు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివకు 88,89,585 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4,35,603 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
31118 new COVID 19 infections in India
- Advertisement -