- Advertisement -
హైదరాబాద్: బల్దియా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గ్రేటర్ లో ఉదయం 11గంటల వరకు 8.90 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అటు ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లో ఎల్లుండి రీపోలింగ్ జరుగనుంది. గుర్తులు తారుమారు కావడంతో ఎస్ఇసి రీపోలింగ్ కు నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పత్రంలో సిపిఐ అభ్యర్థి ఎదురుగా సిపిఎం గుర్తు వచ్చింది. బ్యాలెట్ పత్రంలో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు పడింది. రీపోలింగ్ నేపథ్యంలో మంగళవారం 6గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కు ఎస్ఇసి నిషేధం విధించింది.
8.09 per cent polling in Greater till 11 am
- Advertisement -