Sunday, April 28, 2024

ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా….

- Advertisement -
- Advertisement -

32 of family test COVID-19 positive

 

లక్నో: భారత్ లో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని  బండా జిల్లాలోని ఒక కుటుంబంలో 32 మంది కరోనా వైరస్ సోకింది. ఇదే జిల్లాలో మొత్తం 44 కేసులు నమోదుకావడంతో కరోనా కేసుల సంఖ్య 807కు చేరుకుందని జిల్లా మెడికల్ ఆఫీసర్ ఎన్ డి శర్మ పేర్కొన్నారు. తాజాగా కరోనా వైరస్ తో జర్నలిస్టు నీలన్షు శుక్లా చనిపోయాడు. శుక్లా కరోనా పాజిటివ్ అని తెలియగానే తనతో పాజిటివ్ ఉన్నవాళ్లు కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు శుక్లా ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాసవిడిచారు. యుపిలో కరోనా కేసుల సంఖ్య 2.30 లక్షలకు చేరుకోగా దాదాపుగా 3500 మంది మృత్యువాత పడ్డారు. భారత్ లో కరోనా వైరస్ 36.94 లక్షల మందికి వ్యాపించగా 65 వేల మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 2.56 కోట్లకు చేరుకోగా 8.55 లక్షల మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News