Friday, May 3, 2024

కర్నాటక మంత్రికి కరోనా

- Advertisement -
- Advertisement -

Minister eswarappa corona positive in karnataka

 

బెంగ‌ళూరు: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రజాప్రతినిధులు ఎవరిని వదలకుండా కాటేస్తోంది. తాజాగా కర్నాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె ఎస్ ఈశ్వరప్పకు కరోనా వైరస్ సోకింది. హోమ్ ఐసోలేషన్ లో ఉండి మంత్రి చికిత్స తీసుకుంటున్నారు. కర్నాటకలో కరోనా కేసుల సంఖ్య 3.42 లక్షలకు చేరుకోగా 5700 మంది మృత్యువాతపడ్డారు. కర్నాటకలో ప్రస్తుతం కరోనా బారి నుంచి 2.49 లక్షల మంది కోలుకోగా వివిధ ఆస్పత్రుల్లో 88 వేల మంది చికిత్స పొందుతున్నారు. భారత్ లో కరోనా వైరస్ 36.94 లక్షల మందికి వ్యాపించగా 65 వేల మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 2.56 కోట్లకు చేరుకోగా 8.55 లక్షల మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News