న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 34,884 కేసులు, 671 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 10,38,716కి పెరిగాయి. వీటిలో 3,58,692 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 6,53,751 నయమై డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 26,273 కోవిడ్ బాధితులు మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విస్తరణ వేగంగా జరుగుతోంది. ఎపిలో 40,646 మందికి కరోనా సోకగా… 534 మంది మరణించారు.
తెలంగాణలో ఇప్పటివరకు 42,496 మందికి కోవిడ్ సోకింది. 403 మందిని ఈ మహమ్మారి కబలించింది. అటు మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 2లక్షల 92,589 మందికి ఈ వైరస్ సోకగా… 11,452 మంది ప్రాణాలు తీసింది. తమిళనాడులో లక్షా 60,907 మందికి కరోనా పాజిటివ్ రాగా… 2,315 మంది కోవిడ్ తో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో లక్షా 20,107మందికి కరోనా మహమ్మారి సోకగా.. 3,571 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది.
34884 cases and 671 deaths reported in India