Monday, May 6, 2024

ఆగ్రాలో ఎస్‌ఐ కాల్చివేత..

- Advertisement -
- Advertisement -

35 years old SI Shot dead in Agra

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ యాదవ్‌పై కాల్పులు జరగడంతో ఆయన మృతి చెందారు. స్థానిక ఖండోలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఇద్దరు సోదరుల మధ్య భూ తగాదాలో రాజీ కుదిర్చేందుకు యాదవ్ అక్కడికి వచ్చారు. ఇరు వర్గాలకు నచ్చచెపుతున్న దశలో కాల్పులు జరిగాయి. దీనితో పోలీసు అధికారి తూటాల పాలయ్యి అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘటనాస్థలి ఖండోలి దరిదాపుల్లోని నొహర్రా గ్రామంలో జరిగింది. సోదరులు శివనాథ్, విశ్వనాధ్‌కు చెందిన ఉమ్మడి వ్యవసాయ భూమిలో బంగళాదుంపల పంట సేకరణ దశలో ఘర్షణ చెలరేగింది. వీరికి నచ్చచెప్పేందుకు ఎస్‌ఐ యత్నిస్తుండగా కాల్పులకు గురయ్యాడు.

35 years old SI Shot dead in Agra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News