- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,289 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 364 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,54,758కి చేరింది. మరో ఇద్దరు వైరస్ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,856గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 38 లక్షల 95వేల 016 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి నుంచి కొత్తగా 482 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 6,44,993 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,608 మంది కొవిడ్తో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.40 శాతంగా నమోదైంది.
364 new covid-19 cases reported in telangana
- Advertisement -