Saturday, April 27, 2024

భారత్‌లో 78వేలు దాటిన కరోనా కేసులు.. 134 మరణాలు

- Advertisement -
- Advertisement -

Coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ మహమ్మారి విస్తరణ మాత్రం ఆగడం లేదు. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,722 కొత్త కోవిడ్-19 కేసులు, 134 మరణాలు సంభవించాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 78,003కు చేరింది. వీటిలో 49,219 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 26,235 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో 2,549 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నాలుగు రోజుల్లోనే 15వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో రికవరీ రేటు 33శాతం ఉంది. మరణాల రేటు 3.2శాతానికి పడిపోయింది.

3722 New Covid 19 Cases And 134 Deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News