- Advertisement -
భోపాల్: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లా కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వలస కూలీలతో ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడిక్కడే మృత్యువాత పడగా… మరో 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వలస కూలీలు మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
8 labourers dead in road accident at MP
- Advertisement -