Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 37,379 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

India reports 10302 new Covid 19 cases in 24 hrs

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 37,379 కరోనా కేసులు నమోదుకాగా 124 మంది చనిపోయారని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు చేరుకున్నాయి. మహారాష్ట్ర నుంచి (12,160) కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.49 కోట్ల చేరుకోగా 4.82 లక్షల మంది చనిపోయారు. కరోనా సోకిన వారిలో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడంలేదని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కరోనా బారినపడ్డారు. ఢిల్లీలో నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 146.7 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News