- Advertisement -
పుణె: భారత్, ఇంగ్లండ్ మద్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువీ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్స్ తీశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది దూకుడు మీదున్న జేసన్ రాయ్(14) ఆఖరి బంతికి బౌల్డ్ అయ్యాడు. భువీ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ బెయిర్స్టో(1)ను పెవిలియన్ పంపి ఇంగ్లండ్కు షాకిచ్చాడు. మూడో ఓవర్ చివరి బంతికి బెయిర్స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం బెన్స్టోక్స్(24), డేవిడ్ మలన్(04) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది.
- Advertisement -