- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారయ్యారు. చెర్లపల్లి జైలుకు చెందిన ఖైదీలు ఇటీవల కరోనా వైరస్ బారిన పడడంతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే, తప్పించుకోవడానికి ఇదే సరైన సమయం భావించిన ఖైదీలు.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆస్పత్రి నుండి తప్పించుకున్నారు. ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి అక్కడి నుండి నలుగురు ఖైదీలు పారిపోయారు.
4 Corona Infected prisoners escaped from Gandhi Hospital
- Advertisement -