Thursday, May 16, 2024

ఇండోనేషియా జైలులో అగ్నిప్రమాదం: 41 మంది ఖైదీలు సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

జకార్తా: ఇండోనేషియాలోని జకార్తా నగరం టాంగెరంగ్ జైలులో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జైలులోని సి బ్లాక్‌లో మంటలు చెలరేగడంతో 41 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. గాయపడిన 80 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జైలులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టైన ఖైదీలు 122 వరకు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని జైలు అధికారులు వెల్లడించారు. టాంగెరంగ్ జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు. జైలులో ఖైదీలు కనీసం వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News