Monday, April 29, 2024

లోయలో పడిన బస్సు: 26 మంది మృతి

- Advertisement -
- Advertisement -

26 Members dead in Indonesia bus plunges into a ravine

జకర్తా: ఇండోనేషియాలోని జావా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామిక్ జూనియర్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు తసిక్ మలాయా జిల్లా విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీస్ అధికారి ఎకో ప్రసట్యో రోబ్బీయాంటో పేర్కొన్నారు. డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని, 26 మృతదేహాలు బయటకు తీయగా గాయపడిన 35 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీస్ అధికారు దాడెన్ రిడ్వనషా వెల్లడించారు. గాయపడిన వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని రిడ్వనషా పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో సుమత్రా దీవులో బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 35 మంది చనిపోయారు. 2018లో టూరిస్ట్ బస్సు జావాలోని పర్వతం పైనుంచి బస్సు కిందపడడంతో 27 మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News