Thursday, May 9, 2024

ఉద్యోగులకు 43 శాతం పిఆర్‌సి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

43 Percentage PRC give to Employees

 

హైదరాబాద్: ఉద్యోగులకు చరిత్రలో అత్యధికంగా 43 శాతం పిఆర్‌సి ఇచ్చామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పెరిగిన జిల్లాలకు అనుగుణంగా జోన్లకు కేంద్రం అనుమతి ఇవ్వటం లేదన్నారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎంఎల్‌సి అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. విద్యారంగంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తి సురభి వాణి దేవి అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాయర్లకు రూ.100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపి రాములు, ఎంఎల్‌ఎ అబ్రహం, గ్రాడ్యుయేట్లు టిఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News