Sunday, May 12, 2024

ఇండియాలో 12లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

45720 new Covid 19 cases And 1129 deaths in india

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కోవిడ్-19 కేసులు అత్యధికంగా 12 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,720 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 1,129 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇండియాలో మొత్తం కోవిడ్ కేసులు సంఖ్య 12,38,635కు దాటింది. దేశంలో ప్రస్తుతం 4,26,167 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 7,82,606 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని నయమైయ్యారు. దేశవ్యాప్తంగా 29,861 మంది కరోనాతో చనిపోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. అటు తెలుగురాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కేసులు 49,259కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 438 మంది కోవిడ్ తో మృతి చెందారు. ఎపిలో మొత్తం 64,713 మందికి కరోనా సోకగా… 823 మంది ఈ వైరస్ తో మరణించారు.

45720 new Covid 19 cases And 1129 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News