Monday, May 6, 2024

విదేశీ నిధుల లైసెన్సుల పునరుద్ధరణను తిరస్కరించిన 466 ఎన్‌జివోలు !

- Advertisement -
- Advertisement -

Parliament

ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఆక్స్‌ఫామ్ ఇండియా దరఖాస్తు డిసెంబర్ 2021లో తిరస్కరించబడింది. యునైటెడ్ కింగ్‌డమ్ ఈ అంశాన్ని భారత్ తో లేవనెత్తింది.

న్యూఢిల్లీ: 2020 నుంచి 466 ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జిఓ) ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద లైసెన్సుల పునరుద్ధరణను తిరస్కరించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం పార్లమెంటుకు తెలిపింది.  2020లో 100 మంది, 2021లో 341 మంది, ఈ ఏడాది 25 మంది నుంచి తిరస్కరణలు వచ్చాయని పేర్కొంది. ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఆక్స్‌ఫామ్ ఇండియా దరఖాస్తు డిసెంబర్ 2021లో తిరస్కరించబడింది. యునైటెడ్ కింగ్‌డమ్ భారత్‌తో తిరస్కరణను లేవనెత్తింది. విదేశీ నిధులను స్వీకరించడానికి తప్పనిసరి అయిన లైసెన్సుల పునరుద్ధరణకు దరఖాస్తు చేయనందున 5,789 సంస్థలను ఎఫ్‌సిఆర్‌ఎ పరిధి నుండి కేంద్రం తొలగించింది. పత్రాలను పరిశీలించిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించినందుకు 179 సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయబడ్డాయి. వీటిలో చాలా సంస్థలు తమ లైసెన్స్‌ల పునరుద్ధరణ కోసం దాఖలు చేశాయని, అయితే నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం గత వారం గడువును జూన్ 30 వరకు పొడిగించింది.

2021లో 341 కేసుల్లో లైసెన్సుల పునరుద్ధణను నిరాకరించడం జరిగింది. కాగా 2020 నుండి నిరాకరణకు గురికావడం ఇదే అత్యధికం. డిసెంబర్ 31 వరకు దాదాపు 6,000 ఆడ్ సంస్థల పునరుద్ధరణ తిరస్కరణకు గురయ్యాయి. ‘జూన్ 30 తర్వాత తిరస్కరణల సంఖ్య ఎంతో  తెలుస్తుంది’ అని  పేరు తెలుప నిరాకరించిన ఒక అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News