- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 64,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్త 478 కొత్త పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 3మంది మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,814కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 7,067 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,420 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటివరకు 8 లక్షల 65వేల మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు మొత్తం కరోనా టెస్టులు కోటి 10 పక్షలకు పైగా మందికి కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
478 New Corona Cases Registered in AP
- Advertisement -