Tuesday, April 30, 2024

చికాగోలో విమాన ప్రమాదం.. కేరళ వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత్‌కు చెందిన ఓ ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణించారు. విమానం వెనక్కి మలుపు తిరిగే సమయంలో జరిగిన ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న జిజోజార్జి(36) మృతి చెందారని అధికారులు తెలిపారు. కేరళలోని పాతనపురానికి చెందిన జార్జి అక్కడ మెకానిక్‌గా పని చేస్తున్నారు. సోమవారం(అమెరికా కాలమాణం ప్రకారం) ఆయన శవ పరీక్ష నివేదికను అధికారులు వెల్లడించారు. ఆయన భార్య 8 నెలల గర్భవతి కాగా, మరో చిన్నారి ఉన్నారు. ఆయన కుటుంబానికి ఆన్‌లైన్ ద్వారా ఓ సంస్థ నిధులు సేకరిస్తోంది.

Kerala man died after plane crash in Chicago

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News