Monday, May 13, 2024

ఎపిలో కొత్తగా 5,292 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

5292 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 66,769మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 5,292 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 42మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 7,39,719కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 6,128మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 48,661మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,084మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం 6,84,930మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 62,834,0096మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

5292 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News