- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గత 24 గంటల్లో 55,342 కరోనా పాజిటివ్ కేసులు, 706 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 71,75,881కి చేరింది. వీటిలో 8,38,729 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు దేశంలో 62,27,296 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో ఇప్పటివరకు 1,09,856 మంది కరోనాతో మృతి చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, నిన్న పరీక్షించిన 10,73,014 నమూనాలతో సహా అక్టోబర్ 12 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 8,89,45,107కి చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.
55342 new covid 19 cases 706 deaths in india
- Advertisement -