మల్కన్గిరి: ఇంట్లో గొడవల కారణంగా తల్లిదండ్రులిద్దరూ 9ఏళ్ల కన్నకొడుకును అమ్ముకుని చెరోదారి చూసుకున్న అమానుష ఘటన ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లాలోని తెల్గాబెచా గ్రామంలో చోటుచేసుకుంది. కియాంగ్ పంచాయతీకి చెందిన భార్యభర్తలు నిత్యం గొడవ పడుతుండేవారు. దీంతో విడాకులు తీసుకోని విడివిడిగా వివాహం చేసుకున్నారు. కొడుకును అమ్మేయగా వచ్చిన డబ్బుతో చెరోదారి వెళ్లిపోయారు. దీంతో పిల్లవాడు పశువుల కాపరిగామారాడు. బాలుడిని కొన్నవ్యక్తి బాగా హింసించేవాడని, అతనికి సరిగ్గా ఆహారం ఇచ్చేవాడు కాదని స్థానికులు ఆరోపించారు. తాజాగా ఆ బాధల నుంచి తప్పించుకుని అంగన్ వాడీ కేంద్రంలో తలదాచుకుంటున్నాడు. బసుదేవ్ భూమియాగా బాలుడి గుర్తించిన గ్రామస్తులు శనివారం బ్లాక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు చేసిన తప్పుకు కొడుకు బాధపుడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు.