- Advertisement -
ధార్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్, ట్యాంకర్ ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు మైనర్ల ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
- Advertisement -