Wednesday, May 15, 2024

ఎపిలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 6,190 కేసులు

- Advertisement -
- Advertisement -

6190 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 68,429వేల మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 6,190 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 35మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,87,351కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,7805మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59,435మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,836మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం 6,22,136మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 57,34,752మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

6190 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News