Monday, April 29, 2024

క్రీడాకారుల కోసం సిఎం కెసిఆర్ ప్రోత్సాహకాలు

- Advertisement -
- Advertisement -

CM KCR Incentives for Athletes

 

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా మైదానాల నిర్మాణం
ఇప్పటికే 50 స్టేడియాలనును ప్రారంభం
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడాకారుల కోసం సిఎం కెసిఆర్ అనేక ప్రోత్సాహాకాలను ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రతిభ గల నిరుపేద కుటుంబాలకు చెందిన ఉత్తమ అథ్లెటిక్స్‌లు జె. దీప్తి, జి. మహేశ్వరి, ఏ. నందిని, ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్‌లకు ప్రోత్సాహంగా ఎలక్ట్రానిక్ స్కూటీలతో పాటు ఒక్కొక్కరికీ నగదు పురస్కారంగా 10 వేల రూపాయలను రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ముగ్గురు అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఆర్థికంగా ప్రోత్సాహం అందించడానికి ముందుకు వచ్చిన రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, సాయికృష్ణా, బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ ను మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 50 స్టేడియాలనును ప్రారంభించామన్నారు. మిగతా స్టేడియాలు నిర్మాణ దశలో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్య అభ్యసించటానికి 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్ లాంటి వేదికలపై మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని భారీగా పెంచామన్నారు. ప్రతిభ కలిగిన గ్రామీణ, నిరుపేద క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సాహిస్తున్నామన్నారు. క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. అందులో భాగంగా సిఎం కెసిఆర్ క్రీడా పాలసీని ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య, స్పోర్ట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ప్రముఖ బ్యాట్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్, ఎంఎల్‌ఆర్ మోటార్స్ డైరెక్టర్ సాయి కృష్ణ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్, ఒలింపియన్ శోభ, క్రీడాకారులు, కోచ్ లు, శాట్స్ ఉన్నతాధికారులు సుజాత, వెంకయ్యలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News