Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొత్తగా 621 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

621 New Covid cases reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,13,012 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 621 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు 6,44,951కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,802కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 691 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,32,080కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,069 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

621 New Covid cases reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News