- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 35,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6,582మందికి కరోనా సోకిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. మరో 22మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 9,62,037కి చేరింది. ఎపిలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 7,410కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,343 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 9.9 లక్షల మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
6582 New Corona Cases Reported in AP
- Advertisement -