- Advertisement -
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో మొత్తం 24,962 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 765 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని, కరోనాతో మరో 12మంది మృతిచెందారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 17,699 కరోనా కేసులు నమెదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 218మంది ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 32మందికి కరోనా సోకగా, విదేశాల నుంచి వచ్చిన మరో ఆరుగురికి పాజిటీవ్ వచ్చిది. ప్రస్తుతం 9,473మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడిన 8,008మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఎపిలో 9,96,572 కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.
765 New Corona Cases Reported in AP
- Advertisement -