Thursday, May 16, 2024

రాష్ట్రంలో కొత్తగా 77 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

77 new covid cases repored in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 23,936 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…77 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,90,301కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 154 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,85,126 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.34 శాతంగా నమోదైంది. మరో 1,030 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News