Thursday, May 16, 2024

విషాదం: ఎల్‌పిజి సిలిండర్ పేలి 8మంది మృతి..

- Advertisement -
- Advertisement -

గోండ: ఎల్‌పిజి సిలిండర్ పేలిపోవడంతో ఒక రెండంతస్తుల భవనం కూలిపోయి ముగ్గురు పిల్లలతోసహా 8 మంది మరణించారు. మంగళవారం రాత్రి టిక్రి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం లక్నోలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నూరుల్ హసన్ అనే వ్యక్తి ఇంట్లో ఎల్‌పిజి సిలిండర్ పేలుడు సంభవించిందని, ఈ పేలుడు తీవ్రతకు రెండంతస్తులు భవనం నేలమట్టమైందని జిల్లా మెజిస్ట్రేట్ మార్కండేయ షాహి తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

8 Killed after LPG Cylinder blast in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News