Friday, May 10, 2024

ఎపిలో మరో 88మంది మృతి..

- Advertisement -
- Advertisement -

8012 New Corona Cases Registered in AP

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రస్థాయిలో విజృంభిస్తుం‌ది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో మొత్తం 70,068 శాంపిళ్ల‌ను పరీక్షించగా.. కొత్తగా 8,012 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 88మంది మ‌ర‌ణించినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 2,89,829కు చేరుకుంది. ఇప్పటివరకు ఎపిలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 2,650కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 85,945మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,01,234మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు మొత్తం 28 లక్షల 60వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

8012 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News