Tuesday, May 7, 2024

ఇండియాలో 70వేలకు చేరిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,604 కొత్త కోవిడ్ -19 కేసులు, 87 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ లో మొత్తం మరణాల సంఖ్య 2,293 చేరింది. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 70,756 పెరిగింది. అందులో 46,008 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 22,454 ఈ వైరస్ మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు డిశ్చార్జ్ అయ్యారు. అటు ప్రపంచవ్యాప్తంగా 42.52 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 2.87లక్షల మందికి పైగా కోవిడ్ తో ప్రాణాలు విడిచారు. 15.25లక్షల మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రప్రచంలో 24.39మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News