Saturday, May 4, 2024

4వేల మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా.. 47మంది మృతి

- Advertisement -
- Advertisement -

Maharashtra Cop Tests positive for Corona

ముంబయిః కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వణికిస్తోంది. దీంతో రాష్ట్ర పోలీసు శాఖలో కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది. ఆదివారం కొత్తగా 88 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకగా.. కరోనాతో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహారాష్ట్ర పోలీసుశాఖలో మొత్తం 4,048 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 47 మంది పోలీసులు మృతి చెందారు. ఇక, మహారాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య లక్ష 25వేలు దాటింది. కాగా, ఒక మహారాష్ట్రలోనే కరోనాతో 5,984 మంది ప్రాణాలు కోల్పోయారు.

88 Maharashtra Cops Tests positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News