- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 53,026 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,943 కొత్త కరోనా కేసులు, 97మరణాలు సంభవించినట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,73,085కి పెరిగాయి. ఇప్పటివరకు 2,475మంది కోవిడ్ తో మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,80,703మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 89,907 యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 27.58లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్టు అధికారులు తెలిపారు.
8943 corona cases and 97 deaths in andhra pradesh
- Advertisement -