Friday, April 26, 2024

కాశ్మీర్ లోయలో 9మంది ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: కాశ్మీర్ లోయలో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుబెట్టాయి. ఇటీవల దక్షిణ కశ్మీర్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టారు. దక్షిణ కశ్మీర్ లోని బాత్పురాలో నిన్న(శనివారం) సైనికుల ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కెరన్ సెక్టార్ నుంచి చొరబాటుకు యత్నించిన మరో ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా.. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

9 Terrorists Killed in Security Forces in Kashmir Valley

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News