హైదరాబాద్ : ఆర్టిసిలో పనిచేసే మహిళా సిబ్బందికి కల్పించే సౌకర్యాల్లో భాగంగా అధికారులు నగరంలో పలు ప్రాంతాల్లో ఉండే చేంజ్ ఓవర్ పాయింట్ల వద్ద బయోటాయిలెట్లను ఏర్పాటు చేశారు. వీటిని ఆర్టిసి ఎండి, రవాణశాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ సోమవారం జెబిఎస్లో పరిశీలించారు. బయోటాయిలెట్ల ఏర్పాటు కోసం ఆర్టిసి పాతబస్సులను ఎంచుకుంది. మధ్యాహ్న సమయంలో పలు ప్రాంతాల్లో ఉండే చేంజ్ ఓవర్ పాయింట్లలో మహిళలకు, పురుషుల సిబ్బందికి ప్రత్యేకంగా దుస్తులను మార్చుకునేందుకే కాకుండా ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు వీటిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. త్వరలో మరిన్ని బయోటాయిలెట్లను సిబ్బంది అందుబాటులో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా అధికరెవెన్యూపై దృష్టి సారించాలని గ్రేటర్హైదరాబాద్ జోన్లో నష్టాలను తగ్గించాలని సిబ్బందిని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వెంకటేశ్వర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.