- Advertisement -
ఆదిలాబాద్: ఢిల్లీ మర్కజ్కు వెళ్లి వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆశా వర్కర్పై దాడి చేసిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరరి లక్ష్మీనగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆశా కార్యకర్త భారతి శివాజీ చౌక్ సమీపంలో ప్రతి ఇంట్లోకి వెళ్లి ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఓ ఇంట్లోకి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా కుటుంబ సభ్యులు ఆమెను తిడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆమె వారి నుంచి తప్పించుకొని మిగతా కార్యకర్తలకు తెలిపింది. వెంటనే వారు డిఎంహెచ్ఎ చందుకు సమాచారం ఇచ్చారు. డిఎంహెచ్ఎ సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మర్కజ్ వెళ్లిన వ్యక్తిని క్వారంటైన్కు తరలించినట్టు సమాచారం.
Markaz tourist attack on asha workers in Adilabad
- Advertisement -