- Advertisement -
విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటనలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు మా బృందాలు అక్కడే ఉంటాయని ఎన్డిఆర్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నంకు మరో ఎన్డిఆర్ఎఫ్ బృందం చేరుకుంటోందని తెలియజేశారు. ప్రస్తుతానికి గ్యాస్ లీకేజీ అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ కావడంతో పది మంది మృతి చెందారు. ఆస్పత్రుల్లో 350 మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
- Advertisement -